తెలంగాణ

రేపు మాగనూరులో నూతన వ్యవసాయ విధానంపై అవగాహన

శక్తి టీవీ, మక్తల్: నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్ గ్రామంలో ఉన్న రైతువేదిక భవనంలో శుక్రవారం మధ్యాహ్నం12 గంటలకు నూతన వ్యవసాయ విధానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు గిన్నె మధుసూదన్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు రైతులు హాజరుకావాలని కోరారు.

Leave a Reply