జాతీయ వార్తలు

ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు బాలికలు సజీవదహనం

శక్తి టీవీ, వెబ్ డెస్క్: బిహార్​లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముజఫర్​పుర్​ జిల్లాలోని రామ్‌దయాళ్​ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రామ్‌దయాళ్​ ప్రాంతంలోని ఇరుకు ఏరియల్ నివసించే ఓ ఇంట్లో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెనువెంటనే పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లకి కూడా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు బాలికలు మంటల్లో చిక్కుకొని అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఇంట్లోని సామగ్రి కాలి బుడిదైంది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. వారిని చికిత్స కోసం ఎస్​కేఎమ్​సీఎచ్​ ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply